పనితీరు,ఆర్థికసహకారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టండి

` కేంద్రానికి కేటీఆర్‌ డిమాండ్‌
` స్టాలిన్‌కు తన మద్దతు ఉంటుందని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.దేశ అవసరాలకు తగినట్లు కుటుంబ నియంత్రణను బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్‌ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ నిర్మాణంలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.8 శాతం మాత్రమే ఉండగా.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందని కేటీఆర్‌ వివరించారు.
స్టాలిన్‌కు కేటీఆర్‌ మద్దతు
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే నియోజకవర్గాల పునర్విభన చేయాలని భావిస్తే.. అది దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా ఉండాలని ప్రతిపాదించారు. దేశ నిర్మాణానికి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.8 శాతం మాత్రమే ఉందని.. కానీ దేశ జీడీపీలో మాత్రం 5.2 శాతం కంటే ఎక్కువ వాటా అందిస్తోందని పేర్కొన్నారు.