పర్యటనకు వెళ్లనున్న అరుణ్ జైట్లీ
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పది రోజుల విదేశీ పర్యటనకు శనివారం బయలుదేరనున్నారు. అమెరికా, పెరూ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల నాలుగో తేదీన అమెరికాలోని న్యూయార్క్ చేరుకోనున్నారు. అక్కడి కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్టోబరు 9 నుంచి 11వ తేదీల్లో ఆయన పెరూలో పర్యటించనున్నారు. అక్కడి లిమాలోని బ్యాంక్ ఫండ్ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ఆయనతోపాటుగా ఆర్బీఐ గవర్నర్ రఘురాంరాజన్ , ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ప్రధాన ఎన్నికల సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్లు… తదితరులు పాల్గొంటారు.