పశ్చిమ్‌బంగ, అసోంలో కొనసాగుతున్న పోలింగ్‌

0eqewh7u
కోల్‌కతా: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ్‌బంగ, అసోంలలో తొలి దశ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. పశ్చిమ్‌బంగలో 18 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసోంలో 65 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 539 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను బందోబస్తుకు వినియోగిస్తోంది.