పశ్చిమ బెంగాల్‌లో ఆర్మీ

dc-cover-jjoccp7vfjge3oq0fl16dv6fu6-20161003141153-mediపార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాలు, వంతెనల వద్ద ఆర్మీ మోహరింపుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) ఎంపిలు లోక్‌సభలో ప్రస్తావించారు. సభ్యులు దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ ప్లాజాల వద్ద ఆర్మీ పోలీసులు మోహరించడం సాధారణ విన్యాసాల్లో భాగమేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈస్టర్న్‌ కమాండ్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుందని ఈస్టర్న్‌ కమాండ్‌ తెలిపిందని ఆయన చెప్పారు.