పాంపోర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్

2జమ్మూకాశ్మీర్ లోని పాంపోర్ లో భద్రతా బలగాల ఆపరేషన్ రెండో రోజు కొనసాగుతోంది. ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలప్ మెంట్ బిల్డింగ్ లోపల నుంచి భద్రతా బలగాల పైకి మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారు. భద్రతా బలగాలు కూడా భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మిలిటెంట్ మరణించాడు. మరోవైపు, మిలిటెంట్ల కాల్పుల్లో ఇవాళ ఒక ఆర్మీ కెప్టెన్ సహా ఇద్దరు పోలీసులు, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక పౌరుడు మరణించగా… మరో 10 మంది గాయపడ్డారు. భవనం లోపల సాధారణ పౌరులెవరూ బందీలుగా లేరని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. లోపల ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది మిలిటెంట్లు ఉండొచ్చని, ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన దాడి అని భావిస్తున్నారు.