పాక్‌లో వరద బీభత్సం: 71కి చేరిన మృతుల సంఖ్య

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ని పలు ప్రదేశాలని కొద్ది రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 71 మందికిపైగా మృతిచెందారు. ఖైబర్‌ కనుమలు, గిల్గిట్‌-బల్తిస్థాన్‌ ప్రదేశాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ భవనాలు వర్షాలకు నాని కూలిపోయాయి. వరదలు, కొండచరియల కారణంగా మార్చి9 నుంచి ఇప్పటివరకు 212 మంది మృతిచెందగా మరో 188 మంది గాయపడినట్లు ఎన్డీఎంఏ నివేదికలో వెల్లడించింది.