గోవాలో సత్తా చాటిన బిజెపి
ఉప ఎన్నిక జరిగిన రెండుచోట్లా గెలుపు
సిఎం మనోహర్ పారికర్,మంత్రి విశ్వజిత్ రాణెళి విజయం
తన సవిూప కాంగ్రెస్ ప్రత్యర్థి రాయ్ నాయక్పై ఆయన 10,066 ఓట్ల ఆధిత్యంతో గెలుపొందారు. ఉపఎన్నికలు జరిగిన రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలుపొందడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చిన ప్రజలకు మనోహర్ పారికర్, విశ్వజిత్ రాణెళి కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది ప్రారంభంలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో గెలుపొందిన భాజపా.. చిన్న పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్.. ఆ పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
సీఎం మనోహర్ పారికర్ పనాజీ ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. 4803 ఓట్ల మెజారిటీ తో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గిరిష్ చొదన్కర్ పై ఎమ్మెల్యేగా మనోహర్ గెలుపొందారు. చొదన్కర్ కు 5059 ఓట్లు రాగా.. మనోహర్ కు 9862 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రాజ్యసభ ఎంపీ పదవికి ఆయన వచ్చే వారం రాజీనామా చేయనున్నట్లు తెలియజేశారు. ఇకపోతే రాణెళి ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటంతో తిరిగి వాల్పోయ్ నుంచే పోటీచేసి భారీ విజయం సాధించారు. సోమవారంనాటి ఫలితాల అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల బలం 14కు చేరింది. కాంగ్రెస్కు అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలు ఉండగా, గోవా ఫార్వార్ట్ పార్టీ, మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెరో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. ఎన్సీపీ నుంచి ఒక ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ఆగస్టు 23న దేశవ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. గోవాలోని పనాజీ, వాల్పోయి, దిల్లీలోని బావన, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఈ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు సాగింది. బావన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది.