పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్‌

ఖమ్మం, జనంసాక్షి: జిల్లాలో షర్మిల మరో ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన గురువారమిక్కడ తెలిపారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ సీపీని బలలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని అజయ్‌ కుమార్‌ తెలిపారు.