పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిని ముగ్గురి సస్పెన్షన్‌

జయశంకర్‌ భూపాలపల్లి,జనవరి17(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్‌ విలేకరులకు

తెలిపారు. వీరుపంచాయితీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు విరుద్దంగా నడుచుకోవడం వల్ల చర్య తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గ్రామానికి చెందిన మేకల బాబూరావు, మరాఠి రవీందర్‌, అక్బర్‌లు పార్టీ నియమ, నిబంధనలు పాటించకపోవడం, సొంతపార్టీ నాయకులను దుర్భాషలాడుతుండడంతో వారిని పార్టీని నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఈరోజు నుంచి వారికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. వీరి చర్య కారణంగా పార్టీలో క్రమవ ఇక్షణ కట్టుతప్పే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇదిలావుంటే మండలంలో పంచాయితీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సత్తా చాటుతుందన్నారు. కెసిఆర్‌ అమలు చేస్తున్న అబివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. అదే తమ విజయానికి దోహదపడుతాయన్నారు.