పార్లమెంట్‌ ముట్టడికి వైసీపీ యత్నం…

qp73dla8జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు అరెస్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 10 : దీక్షా శిబిరం నుంచి పార్లమెంట్‌వైపు ర్యాలీగా వెళున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ తన అనుచరులతో సోమవారం ఉదయం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. దీక్ష ముగిసిన అనంతరం పార్లమెంట్‌ను ముట్టడించేందుకు కార్యకర్తలతో జగన్‌ ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించారు.

ఈ సందర్భంగా జగన్‌ మీడియాతో మాట్లాడుతూ నాతోపాటు 7 మంది ఎంపీలు, 66 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా అరెస్టు అయ్యామని, కారణం ఆంధ్రా రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలకూడదనే ఒకే ఒక కారణమని…ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పడానికి సిగ్గుతో అందరం తలవంచుకున్నామని జగన్‌ వ్యాఖ్యానించారు.