పార్లమెంట్ సభలు ప్రారంభం

fotorcreated36పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం రెండో రోజు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహజన్రా, రాజ్యసభలో కురియన్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ 20 నిమిషాల పాటు వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దు విషయంపై విపక్షాలు పోడియం వద్ద ఆందోళన చేయడంతో సభను వాయిదా వేశారు.