పాలమూరు డీఈఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆందోళన చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కార్యకర్తలు డీఈఓ ఆఫీసుకి తీళాలు వేసి ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దురుసేగా ప్రవర్తించి కార్యకర్తలను దుర్భాషలాడుతూ చితకబాది పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.