‘పాలేరు’పై మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష

` సీతారామ ప్రాజెక్టు పెండిరగ్‌ పనులను చేపట్టాలి
` ఉత్తమ్‌ను కోరిన తుమ్మల
హైదరాబాద్‌(జనంసాక్షి): నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రధానంగా పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై సవిూక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండిరగ్‌ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ను తుమ్మల కోరారు.కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు. ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నారన్నారు. ప్రజా పాలన ఎలా ఉండాలో ఒక నెలలోనే తాము ప్రదర్శించామన్నారు. తెలంగాణ ప్రజలు కొత్త స్వాతంత్య్ర భావాన్ని గ్రహిస్తున్నారన్నారు. గత నెల రోజులుగా నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల పనితీరును అంచనా వేసేందుకు పలు సవిూక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నష్టం తదితర అంశాలపై సవిూక్షించామని, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడంతో పాటు విషయాన్ని ప్రజలకు, విూడియాకు వివరించామన్నారు. ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామన్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల మంత్రిని సీఎంతో కలిసి ఢల్లీిలో కలిశామన్నారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు.