పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాళ నామినేషన్

పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందాళ నామినేషన్

ఖమ్మం.తిరుమలాయపాలేం.
(నవంబర్ 08) జనం సాక్షి. పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం తాహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఐదేళ్లపాటు చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకు చేసిన సేవ అత్యధిక మెజారిటీతో తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు…ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయం లోని నివాసం నుండి బయల్దేరి మారెమ్మ తల్లి దేవాలయం దర్శించుకున్న పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఎన్నికల రిటర్నిoగ్ అధికారికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు.ఆయన వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు ,మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ,జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి ,60వ డివిజన్ కార్పోరేటర్ నిరంజన్ ,కందాళ దీపిక తదితరులు ఉన్నారు