పిచ్చోడి చేతిలో రాయిలా..  జగన్‌ చేతిలో అధికారం


– ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని
అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో సోషల్‌ విూడియాలో టార్గెట్‌ చేశారు. జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో యువతకు కష్టాలు ఎదరవుతాయంటూ ఆయన అన్నారు.  కేశినేని తన ట్వీట్‌లో ‘జగన్‌ రెడ్డి గారూ.. పిచ్చి వాడి చేతిలో రాయిలాగా ఉంది విూ చేతిలో అధికారం.. విూరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె ఢిల్లీ లాంటి చోట్లలో మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది పరిస్థితి ఉదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే సంస్థలు, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూ ప్రకారం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని విజయవాడ ఎంపీ తప్పుబట్టారు.. ఈ చట్టం వల్ల నిరుద్యోగులకు కష్టాలు పెరుగుతాయంటున్నారు.