పూణె నుంచి నాసిక్ త్రయంబకేశ్వర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం
9 మంది ప్రయాణికుల మృతి
పూణే: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా.. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన పూణే జిల్లాలోని నారాయణగాన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పూణె నుంచి నాసిక్ త్రయంబకేశ్వర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నారాయణగాన్ సమీపంలోకి చేరుకోగానే భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రహదారి సరిగ్గా కనిపించక రోడ్డు పక్కన నిలిచి ఉన్న టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.