పెటాకులు కాబోతున్న తేజ్వీ యాదవ్ పెళ్లి
ఆరు నెలల్లోనే విడాకులకు దరఖాస్తు
పాట్నా,నవంబర్3(జనంసాక్షి): తేజ్ప్రతాప్ యాదవ్ పెల్లి పెటాకులు కాబోతున్నది. అట్టహాసంగా జరిగిన పెల్లి ఆరునెల్లోనే ముగియబోతోంది. భార్యాభర్తలు దూరం దూరంగా ఉండడం కంటే విడాకులు తీసుకోవడమే మంచిదంటున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. అతికష్టంగా కలిసి ఉండడం కన్నా.. విడిపోవడమే మంచిదన్నారు. గత మే నెలలో ఐశ్వర్యను పెళ్లాడిన తేజ్ ప్రతాప్.. ఆరు నెలల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విడాకులపై విూడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. కష్టంగా కలిసి ఉండడం ఇష్టంలేక విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. ఐతే, వారిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిగా ఉంటున్నారనేది వెల్లడించలేదు