పెద్దమ్మ తల్లి దేవస్థానానికి 50వేల రూ విరాళం అందించిన

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్.

డోర్నకల్/కురవి, సెప్టెంబర్-7, జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదునపల్లి గ్రామము కిసాన్ పరివార్ వ్యవసాయ క్షేత్రంలో బూత్ స్థాయి కమిటీల సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన భూపాల్ నాయక్ ని సిరోల్ మండల నాయకులు కలవగా నూతన పెద్దమ్మతల్లి దేవస్థానానికి 50,000 వేల రూపాయలు విరాళం అందించిన కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపకులు నానవత్ భూపాల్ నాయక్.ఆ పెద్దమ్మతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని కోరారు.. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో రంగన్న గౌడ్, డి వై గిరి, గుగులోతూ భీమ నాయక్,విష్ణు నాయక్,వెంకట్రమణ,వెంకటేష్, రాజు,వీరణ,నాగేంద్ర,అశోక్,నరేష్, అప్పలరాజు ,విక్కీ, సోషల్ మీడియా భగత్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.