పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా గత సెప్టెంబరు మాసంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో 14.5 శాతం వృద్ధి నమోదు అయింది.అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 58 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరులో 66 లక్షలకు చేరింది. దాదాపు 36.5 శాతం వాటాతో ఇండిగో సంస్థ దేశీయ విమానయన మార్కెట్లో అత్యధిక వాటాను సొంత చేసుకుంది. తరువాత స్థానంలో ‘జెట్‌ ఎయిర్‌వేస్‌-జెట్‌లైట్‌’ సంస్థలు కలిపి 22 శాతం మార్కెట్‌ వాటాను అందుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా 15.9% వాటాతో మూడో స్థానంలో నిలిచింది.