పేదలను వాడుకుంటే వదిలేది లేదు
పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న జన్ధన్ ఖాతాల్లోకి కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయలు జమ అయ్యాయంటూ వచ్చిన కధనాల నేపథ్యంలో మాట్లాడిన మోదీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల వ్యవస్థ దిశగా అడుగులు వేయాలని, ఈ రకమైన ఆర్థిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆదివారం చేసిన మన్కి బాత్లో ప్రజలకు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి పెద్దలకు, పేదలకు తెలియజేయాలని, వారిలో సరైన అవగాహన కలిగించాలని యువతను కోరారు.