పొదుపు మహిళలు పాత రుణాలు చెల్లించాలి

కర్నూలు,జూలై22(జ‌నంసాక్షి): పొదుపు సంఘం మహిళలు పాత రుణాలు చెల్లించి వెంటనే కొత్త రుణాలు పొందాలని పగిడ్యాల ఏపీఎం శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండల సమాఖ్య సమావేశాన్ని అధ్యక్షురాలు మమత నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ.. ప్రాతకోట, పగిడ్యాల, లక్ష్మాపురం, గణపురం గ్రామాలలో పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ముందంజలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన గ్రామాలలో అప్పు వసూలు చేయాలని గ్రామైఖ్య సంఘ లీడర్లను ఆదేశించారు. అనంతరం మండల సమాఖ్యలో నెలవారీ వసూళ్లు, అప్పు, ఖర్చుపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ స్వాములు, ఇస్మాయిల్‌, స్వర్ణలత, ఆయా గ్రామైఖ్య సంఘ లీడర్లు, పుస్తక నిర్వాహకులు పాల్గొన్నారు.