పోడురైతులకు న్యాయం చేయాలి

ఖమ్మం,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   పోడుదారులపై కేసులు పెట్టి… పంటలు నాశనం చేయడంతో… బంగారు తెలంగాణ వచ్చినట్లా? అని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. పోడుదారులను ప్రభుత్వం భయ భ్రాంతులకు గురిచేస్తుండడం దారుణమన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే వామపక్ష పార్టీల నాయకుల మంతా కలిసి పోరాడుతున్నారని అన్నారు. గ్రామప్రణాళికలో పోడు సమస్యను చేర్చి పరిష్కరించాలన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామని  స్పష్టం చేశారు. పోడు సాగుదారులపై కేసులు పెట్టి పంటలు ధ్వంసం చేయడం దారుణమన్నారు.  పోడుసాగు దారులపై ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో కమ్యూనిస్టులకు తెలుసు అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పేదొకటి ఇక్కడ చేసేది మరోటి అని విమర్శించారు. జైలుకైనా వెళ్తామనీ, పోడుభూములను మాత్రం వీడే ప్రసక్తే లేదన్నారు. అధికారం రాకముందు ఇచ్చిన వాగ్దానాలను తెరాస ప్రభుత్వం అధికారం వచ్చాక విస్మరించిందన్నారు.