పోలీసలుకు చిక్కిన మాయలేడి

 

బెంగుళూరు,ఆగస్ట్‌30: అమాయక యువకుల్ని నిలువు దోపిడీ చేసిన మహామాయ’లేడి’ మాల ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కింది. పలు ఫిర్యాదులు అందుకున్న మైసూర్‌ రూరల్‌ పోలీసులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు. ఎందరినో తన వలలో వేసుకుని వారిని మోసగించి, తప్పించుకు తిరుగుతోంది. తన అందంతో మత్తెక్కించి దోచుకోవడంలో సిద్ధహస్తురాలైన ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైసూరు నగరంలోని అశోకపురానికి చెందిన బాధితుడొకరు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను పోలీసులు బంధించారు. ఒంటరిగా వాహనాల్లో వెళ్లే యువకుల్ని చూసి చిరునవ్వుతో పలకరిస్తుంది. అందుకు బదులుగా నవ్వితే.. అంతే సంగతులు. ఆమె వలలో అడ్డంగా పడిపోయినట్లే. నవ్వుతో ఆకట్టుకునే ఆమె తరువాత వారిని ఒంటరిగా ఫలానా ప్రాంతానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అలా పరిచయాన్ని మరింత బలపడేలా చేస్తుంది. ముగ్గులో మునిగాక.. ఖాళీ చెక్కులు, పేపర్ల విూద సంతకం చేయించుకుని మాయమవుతుంది. సంతకం చేయడానికి నిరాకరించే వారిని తన అనుచరులతో బెదిరిస్తుంది. మాయ లేడిపై కేసు నమోదు చేసిన మైసూరు రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.