పోలీసుల అదుపులో బీహార్ మాజీ సిఎం మాంఝీ తనయుడు ప్రవీణ్

పాట్నా, సెప్టంబర్ 13: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సిఎం జితన్ రామ్ మాంఝీ తనయుడు ప్రవీణ్ మాంఝీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వెంట 4.65 లక్షల రూపాయల నగదు పెట్టుకున్నారంటూ జహానాబాద్‌‌లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎన్నికల సమయం కావడంతో నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తొలుత జెడియూలో ఉన్న జితన్ రామ్ మాంఝీ ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్డీయేలో కొనసాగుతున్నారు.