పట్నా: బిహార్లో ఒక వ్యక్తి సమాచార కమిషన్ అధికారికి రిజిస్టర్డ్ పోస్టులో లంచం పంపించడం కలకలం రేపింది. ఖగారియా జిల్లాకు చెందిన సానోజ్ మిశ్రా తన పిటిషన్ను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ ఒక లేఖను జతచేసి 500 రూపాయలు పంపించినట్లు కమిషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఆ లేఖపై చిరునామాలో ‘బడా బాబుకు’ అని రాశారు. ఈ విషయమై సచివాలయ పోలీసు ఠాణాలో కమిషన్ ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులెవరూ పెదవి విప్పడం లేదు.