ప్యాకేజీలకు ఒప్పుకోం: కిషన్‌రెడ్డి

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తప్పా ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని అలేరులో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్నారు.