ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు
కర్నూలు,జూలై22(జనంసాక్షి): ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే వినతులపై నిర్లక్ష్యం వద్దని పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పగిడ్యాల, ముచ్చుమర్రి, ప్రాతకోట గ్రామాల ప్రజలు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలను ఆయా శాఖలకు పంపి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుబాన్, వీఆర్వోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.