ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి .. – డీటీడీఓ గంగారామ్

మంచిర్యాల , అక్టోబరు10
ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజనాభివృద్ది శాఖాధికారి మడావి గంగారామ్ ,డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుడు మల్లేష్, మంచిర్యాల ఆసుపత్రి మేనేజర్ రజిత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమిత్ లు పేర్కొన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని సాయికుంట లో డాక్టర్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 120 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాలన్నారు. హోమియోపతి వైద్యంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స ఉంటుందన్నారు. ఏటీడీఓ చిరంజీవి, హెచ్ డబ్ల్యు ఓ లు మల్లారెడ్డి, నైతం లక్ష్మణ్, వెంకటరమణ , గీత, విజయ్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.