ప్రత్యేకహోదాపై నోరుమెదపరేం

కాకినాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మాజీమంత్రి బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజలు వీధుల్లో పడి పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని దీనికి అధికార బిజెపి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు చూసి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఓటిఎస్‌ పేరుతో దోపిడీకి తెరతీసారని మండిపడ్డారు.