ప్రధానిని గద్దె దింపుతా..!

mamata-banerjee1afpనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానిని గద్దె దింపుతామని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ జరిగిన ప్రదర్శనలో ఆమె మాట్లాడుతూ దేశం మొత్తం ఇబ్బంది పడుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేదు. నోట్ల రద్దు కారణంగా తలెత్తిన సమస్యలతో ఇప్పటివరకు 80 మంది చనిపోయారు. అయితే నరేంద్ర మోదీ గాఢ నిద్రలో ఉన్నారు అని అన్నారు.