ప్రధాని నరేంద్రమోడీ పర్యటన

vuxcfejoప్రధాని నరేంద్రమోడీ ఇవాళ యూపీ, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ముందుగా యూపీలో పర్యటిస్తారు. షహరాన్ పూర్ సమీపంలోని సర్సవా పట్టణంలో జరిగే కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం చండీగఢ్ చేరుకుని 485 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విమనాశ్రయ టెర్మినల్ ను ప్రారంభిస్తారు. అనంతరం “పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’’ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ లోని రిషికేష్ కు వెళ్లి రాజకీయ సమావేశంలో పాల్గొంటారు.