ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి):
ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోట చేరుకున్నారు. ఆయన్ను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లతో పాటు పలువురు రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పీఎస్‌ఎల్‌వీ-సీ21 లాంచ్‌పాడ్‌ను, రెండో లాంచ్‌పాడ్‌పై ఉన్న జీఎస్‌ఎల్‌వీ-2 ఉపగ్రహ నమూనాను ప్రధాని పరిశీలించారు. దీంతో ఇస్రోలో ప్రధాని మొదటి రోజు పర్యటన ముగిసింది. అనంతరం ఆయన అతిధి గృహంలో రాత్రి బసచేశారు. ఆయన ఆదివారం పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించనున్నారు.