ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం భేటీ అయ్యారు. ఏపీలో కరువు పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై ప్రధానంగా చర్చ జరుగనుంది. ఏపీలో కరువుపై ఓ నివేదికను ప్రధానికి సీఎం అందజేయనున్నారు. కరువుపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, కేంద్రం ఇచ్చిన నిధులు తదితర అంశాలను నివేదికలో పేర్కొన్నారు. దేశంలో ఉన్న కరువు పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏపీ, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశమవుతున్నారు. అంతుకు ముందు ఉదయం చత్తీస్‌గఢ్ సీఎం ప్రధానితో భేటీ అయ్యారు.