ప్రధాని మోదీతో జర్మన్ చాన్స్ లర్ భేటీ

న్యూఢిల్లీ : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్‌లో మోడీతో మెర్కెల్ సమావేశమయ్యారు. సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భద్రత, రక్షణతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌లో మెర్కెల్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏంజెలా మెర్కెల్ భారత్ రావడం ఇదే ప్రథమం. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కోసం ఏప్రిల్‌లో మోడీ జర్మనీ వెళ్లారు. ఆ సమయంలో ఏంజెలా మెర్కెల్‌తో మోడీ సమావేశం అయ్యారు.