ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం

ప్రధాన మంత్రి కార్యాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న  రూం నెంబర్ 242లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంప్యూటర్ యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్  వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.