ప్రభుత్వాలను కూల్చడం మానుకోండి
ఉత్తరాఖండ్ బల పరీక్షలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఫ్లోర్ టెస్టుపై ట్విట్టర్ లో స్పందించిన కేజ్రీవాల్.. ఇక నుంచి ప్రభుత్వాలను కూల్చడం మానుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రధాని మోడీ ప్రభుత్వాలను కూల్చేయడం మానుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేజ్రీవాల్.