*ప్రభుత్వ ఆసుపత్రిలో 15వ కామన్ రివ్యూ డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలో సందర్శన*

ఆరోగ్యశాఖలో జరుగుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనుటకు, అమలు తీరును తెలుసుకొనుటకు 15వ కామన్  రివ్యూ కమిషన్ తరపున డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆరోగ్య బృందం సూర్యాపేట జిల్లాలో  సామాజిక ఆరోగ్య కేంద్రం, కోదాడను సందర్శించినది.వివిధ పథకాల గురించి క్షుణ్ణంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న స్పెషాలిటీ సేవలను తెలుసుకున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలించారు.  ఆశా కార్యకర్తలతో ఆరోగ్య కార్యకర్తలతో అంగన్వాడి కార్యకర్తలతో మాట్లాడి పథకాల తీరు తెలుసుకున్నారు. మాస్ సభ్యులతో మాట్లాడారు .  బృంద సభ్యురాలు డాక్టర్ జ్యోతి రావత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని , జిల్లావ్యాప్తంగా మరికొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అత్యుత్తమ సేవలు రోగులకు అందించినప్పుడే  ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు . క్షయ వ్యాధి రోగుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని , వారికి మాత్రలు పంపిణీ చేయాలని కోరారు. రోగి వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అధికారుల బృంద సభ్యులు డాక్టర్ అమీన్, డాక్టర్ తపస్ , డాక్టర్ గౌరవ్ , రాష్ట్ర అధికారుల బృంద సభ్యులు డాక్టర్ రామకృష్ణ, జేవి  శ్రీనివాసరావు,  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం, ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ రజిని , డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్ , డాక్టర్ హర్షవర్ధన్, జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జయ, అంజయ్య , వీరయ్య ,కిరణ్ , భూతరాజు సైదులు, యాదగిరి, థామస్ , అరుణ , సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.