ప్రభుత్వ వైఫల్యం వల్లే నేతన్నల ఆత్మహత్యలు

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 18. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మా నగర్ లో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుడు మంగళపల్లి సాయి కుటుంబాన్ని పరామర్శించారు.కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఆర్డర్ల పేరుతో వస్త్ర పరిశ్రమను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. ఆర్డర్ల వల్ల కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా పుట్టలను సేకరిస్తూ ఉపాధి పొందే సాయికుమార్ పని లేక ప్రాణాలను తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నేత పరిశ్రమ లోని అనుబంధ పరిశ్రమలతో పాటు అన్ని విభాగాల కార్మికులకు శాశ్వతంగా ఉపాధి కల్పించేలా కొత్త చేనేత పాలసీని తీసుకొస్తామని అన్నారు. కార్యక్రమంలో గోలి వెంకటరమణ, గోనె ఎల్లప్ప, శ్రీనివాస్ పలువురు రు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.