ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న టిడిపి


స్వప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థల దుర్వినియోగం
ఇళ్ల నిర్మాణంలో పేదలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి,అక్టోబర్‌11 (జనంసాక్షి):  ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు వికృత చర్యలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ఏపీలో 5 కోట్ల జనాభా ఉంటే ఇళ్లు లేనివారు 31 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పేదల సొంతింటి కలను టీడీపీ అడ్డుకుంటోందని, సీఎం జగన్‌కు ప్రజాదరణ చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
ఇల్లు లేని వారు ఏపీలో ఇప్పటికీ 31 లక్షల మంది ఉన్నారని తేలిందని, చరిత్రలో వైఎస్సార్‌ తర్వాత ఇప్పుడే పెద్ద ఎత్తున భారీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలిదశలో 15 లక్షల నిర్మాణాలు కూడా చేపట్టామని, ఇల్లు లేదని ఏ ఒక్కరు చేయి ఎత్తకూడదని తాము భావించామన్నారు. మహిళకు ఇవ్వడం, వారికి ఓనర్‌ షిప్‌ ఇవ్వడం అనేది తమ ఆలోచన అని, తమ పార్టీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ ఇల్లు వారికి నివాసమే కాకుండా ఒక ఆస్తిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆధునిక టౌన్‌ షిష్‌లు తయారు చేయడం తమ ధ్యేయ మని, అన్ని వసతులతో ఆ కాలనీలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్‌పై ఉన్న అసూయతో చంద్రబాబు చేసిన నిర్వాకమే ఇదని, ఎన్‌బీసీ స్టాండర్డ్స్‌ ప్రకారమే స్థలం ఎంత ఉండాల నేది నిర్ణయించామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు 215 చదరపు అడుగులు ఉంటే ఇప్పుడు 340 చదరపు అడుగులు ఇస్తున్నట్లు వెల్లడిరచారు. చాలా రాష్టాల్ర కంటే, ఎన్‌సీబీ గైడ్‌ లైన్స్‌ మించి తాము ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇల్లు తాము ఇచ్చే దానికంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని, తాము ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఇండిపెండెంట్‌ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డిపై చులకన భావం తీసుకురావాలని చంద్రబాబు దుర్బుద్ధి అని విమర్శించారు. ’ప్రజాక్షేత్రంలో తేల్చు కోవాల్సిన చంద్రబాబు ఇలా కోర్టులను అడ్డుపెట్టుకుని కుయుక్తులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు సొంత ఆస్తిలా
మారకూడదనే దుర్బుద్ధి కనిపిస్తోంది. చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము ఎప్పుడూ విూ పసుపు కుంకుమ లాంటి కుట్రలు చేయం. బద్వేల్‌ ఎన్నికలో ప్రజల తీర్పుపై మాకు సందేహమే లేదు. ఈ రెండేళ్లలో మా ప్రభుత్వం చేసిన సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తోంది. బీజేపీ వాళ్ళకి తెలిసిన పాండిత్యం అంతా మతమే. సునీల్‌ థియోధర్‌ కూడా అదే మాట్లాడుతున్నాడు. లేని మతం అనే అంశాన్ని తెచ్చి ఎదో లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అప్పుల గురించి మాట్లాడతారు కానీ కేంద్రం చేసిన అప్పులు గురించి మాట్లాడటం లేదు. యూపీలో రైతులపై కారు ఎక్కించిన అంశంపై మాట్లాడరు. ఏ ఎన్నికైనా మేము సీరియస్‌గానే తీసుకుంటాం. వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజా క్షేత్రంలో వాటిని తిప్పికొడతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. బొగ్గు కొరత వచ్చింది. విద్యుత్‌ కొనుగోలు రేట్లు కూడా పెరిగాయి. ఈ సందర్భంలో గృహావసర విద్యుత్‌ వినియోగం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఆరోపించినట్లు పేమెంట్స్‌ సమస్య లేదు. కొనుగోలు చేయడానికి అక్కడ బొగ్గే దొరకడం లేదు. రానున్న అయిదారు నెలల్లో ప్రజలు కొంత విద్యుత్‌ ఆదా దిశగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగ సంఘాలతో మేము సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. వాళ్ళ సమస్యలను పరిష్కరిం చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.