ప్రమాణ స్వీకారం చేసీన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి

కర్నూలు నియోజకవర్గం
కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’ కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి. ఆయన కర్నూలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1994లో తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ 2004లో డోన్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న రాయలసీమ ప్రాంతం నుంచి ఆ వర్గానికి చెందిన కోట్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రాజకీయంగా కలిసివస్తుందని భావిస్తున్నారు.