ప్రమాద బాధితులకు దేవినేని సీతారామయ్య ఆర్థిక సహాయం*

మునగాల మండల కేంద్రంలో గత వారంలో శనివారం 12వ తేదీ రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా, 33 మంది గాయపడ్డ సంగతి విధితమే. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిన  గాయపడిన కుటుంబాలకు మునగాల మండల కేంద్రానికి చెందిన దేవినేని సీతారామయ్య అరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుచున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న భక్తులు ఈ విధంగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన తెలిపారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. వారు తీసుకున్న మంచి నిర్ణయానికి మండల ప్రజలు, పలువురు నాయకులు ఘనంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, పి ఏ సి ఎస్ ఛైర్మన్ కందిబండ సత్యనారాయణ, దేవినేని రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు