ప్రమాద స్థలిని పరిశీలించిన కేరళ సీఎం
కేరళ: కొల్లంలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 86 మంది మృతి చెందగా, దాదాపు 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలిని కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ, మంత్రులు పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచే ప్రదాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. అన్ని విధాలా సహకరిస్తామని వూమెన్ చాందీకి ప్రధాని మోదీ తెలిపినట్లు సమాచారం.