ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను

రైల్వే ప్రయాణంలో భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు railwayticket-kwoc-621x414livemintప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.1.19లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థికశాఖకు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఇటీవల లేఖ రాశారు. అయితే ఆర్థికశాఖ అందులో 25శాతం మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా మొత్తం సొంతంగా సమకూర్చుకోవాలని రైల్వేను కోరింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లపై ప్రత్యేకంగా భద్రత పన్ను వేసి నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.