ప్రారంభమైన ఆర్మీ నియామక ర్యాలి

మహబూబ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. నియామక ప్రక్రియలో భాగంగా నేడు సోల్జర్‌ టెక్నికల్‌ అభ్యర్థులు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఈ నియామక ప్రక్రియ ఈ నెల 27 వరకు కొనసాగునుంది. ఆర్మీ నియామక డైరెక్టర్‌ కల్నల్‌ జోగేష్‌ పర్యవేక్షనలో ఈ కార్యక్రమం జరుగుతోంది.