ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్

pcd4sbtiబీహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాలుగో విడతలో భాగంగా ఏడు జిల్లాల పరిధిలోని 55 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఐతే సమస్యాత్మకమైన 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, అత్యంత సమస్యాత్మకమైన మరో 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. నాలుగో విడతలో మొత్తం 776 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. కాగా పోలింగ్ ప్రారంభం నుంచే జనం పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.