ప్రారంభమైన బీహార్ మూడో దశ పోలింగ్

06d0tysnబీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఐతే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. థర్డ్ ఫేజ్ లో మొత్తం 808 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు కోటీ 45 లక్షల 85 వేల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ ప్రారంభం నుంచే జనం పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ కోసం 5 హెలిక్యాప్టర్లు, డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.