ప్రారంభమైన లోక్సభ
లోక్సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. లోక్సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. స్పీకర్ పోడియం ఎదుట విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. వారి ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు లోక్సభలో ప్రస్తావించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కోరుతున్నామన్నారు.