ప్రేమ కోసం మైనర్ స్టూడెంట్ ఆత్మహత్య
కర్నూలు,మే20(జనంసాక్షి): నంద్యాలలో విషాదం నెలకొంది. మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు, ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలోని సలీంనగర్లో చోటుచేసుకుంది. ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ప్రియుడు సన్నీ మోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలి తండ్రి తనపై కిడ్నాప్ కేసు పెట్టడంతో మోహిత్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మోహిత్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.