ప్లాస్టిక్‌ బ్యాగుల కర్మాగారంలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి):పశ్చిమ దిల్లీలోని ప్లాస్టిక్‌ బ్యాగుల కర్మాగారంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.