Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > జాతీయం > ఫార్వర్డ్బ్లాక్ సీనియర్ నేత అశోక్ఘోష్ కన్నుమూత / Posted on March 3, 2016
ఫార్వర్డ్బ్లాక్ సీనియర్ నేత అశోక్ఘోష్ కన్నుమూత
కోల్కతా: పశ్చిమ్బంగా రాష్ట్రంలో తొలి వామపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన ఫార్వర్డ్బ్లాక్ పార్టీ సీనియర్ నేత, కురువృద్ధుడు అశోక్ఘోష్(94) ఈ రోజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2న ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బంగాల్ రాజకీయాల్లో ఏడు దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన ఘోష్ సాధారణ జీవితం గడిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని ఫార్వర్డ్ బ్లాక్లో చేరిన ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. 1952లో ఫార్వర్డ్బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అవసరమైన సందర్భాల్లో వామపక్ష పార్టీలను సైతం విమర్శించేవారు.